త్వరలో ఇంగ్లండ్లో నిర్వహించనున్న వీధి బాలల క్రికెట్ ప్రపంచకప్లో పోటీ పడనున్న వీధిబాలల భారత క్రికెట్ జట్టుకు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. దీనిపై మిథాలి స్పందిస్తూ.. ‘భారత జట్టుకు అంబాసిడర్గా ఎంపికయినందుకు ఆనందంగా ఉంది. పిల్లల జీవితాల్లో క్రీడలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో ఓ అథ్లెట్గా నాకు బాగా తెలుసు. క్రీడలే వారికి అన్ని వర్గాల మద్దతు లభించేలా ఉపయోగపడుతాయి.ఈ ఆటలతో వీధి బాలల జీవితాలు మలుపు తిరుగుతాయి. లింగ భేదం లేకుండా బాలబాలికలు కలిసి ఈ టోర్నీలో మ్యాచ్లు ఆడనుండటం ఆసక్తికరం. ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా’ అని మిథాలీ తెలిపారు.మిథాలీతో పాటు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి,ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ యజమాన్యం కూడా వీధి బాలల క్రికెట్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో వీధి బాలల క్రికెట్ ప్రపంచకప్ పోటీ జరుగనుంది..