ఎన్టీఆర్‌ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు

ఎన్టీఆర్‌ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాదు: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని నటి మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబునే తాను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తారక్ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఆమెను దూషిస్తున్నారు.దీనిపై స్పందించాలని ఆమె ట్విట్టర్లో ఎన్టీర్కు చేసిన వినతికి అతీ గతీ లేకుండా పోయింది. దాంతో తనను వేధిస్తున్న నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. తనను దూషిస్తూ కొందరు చేసిన ట్వీట్లను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లను గుర్తించి ఆయా ఖాతాల్ని తొలగించాలని ట్విట్టర్ను కోరారు. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos