అలా సంపాదిస్తే పురుగులు పడి చస్తారు..

అలా సంపాదిస్తే పురుగులు పడి చస్తారు..

కొద్ది కాలంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నారు. ఎర్రబెల్లి చేస్తున్న వ్యాఖ్యలు తెరాస ప్రభుత్వానికి కూడా కొత్త తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.ఎన్నికల సమయంలో ప్రజలను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఎర్రబెల్లి తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలోనూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలోనూ గ్రామ సభలో పాల్గొన్న మంత్రివర్యులు గ్రామ సర్పంచ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సర్పంచులు కార్యచరణ ప్రణాళికను సవ్యంగా అమలు చేయాలని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదిస్తే పురుగులు పడి చస్తారని వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టామని గ్రామాలకు వచ్చిన నిధులు స్వాహా చేయాలని చూస్తే జీవితాలను నాశనం చేసుకున్న వారు అవుతారని పేర్కొన్నారు.అక్రమ సంపాదన జోలికి వెళ్లకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని గ్రామ సర్పంచులకు హితవు పలికారు.ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు కారణమవుతున్నాయి.అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి తప్పు చేశారని, టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అభివృద్ధి తన చేతిలో ఉంటుందని, ప్రజలు ఆలోచించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos