వలస కార్మికుల బీభత్సం

వలస కార్మికుల బీభత్సం

సూరత్:. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని, పని ప్రదేశాల్లో తమకు రావాల్సిన వేతనాలు చెల్లించలేదని ఆగ్రహించిన ఇక్కడి వల కార్మికులు శుక్రవారం రాత్రి వాహనాలకు నిప్పు పెట్టారు. డిజైనింగ్ పనులు చేసే మంచాలనూ తగులబెట్టారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. లాక్డౌన్తో పనులు లేక,తిండి దొరక్క అల్లాడుతున్న తమను పట్టించుకున్న నాథుడే లేడని పలువురు వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంత ఊళ్లకైనా పంపించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 378కి చేరింది. మొత్తం 19 మంది మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos