కోల్ కతా: కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కారుపై పశ్చిమ మిడ్నపూర్లో పంచకుడి గురువారం దాడి జరిగింది. దీంతో ఆయన తన పర్యటనను అర్థాంతరంగా కుదించుకుని వెనక్కు మళ్లారు. ‘పంచకుడి లోని స్థానికులు నా కాన్వాయ్పై దాడి చేశారు. కారు కిటికీల గాజు తలుపుల్ని ద్దాలను పగులగొట్టారు. వ్యక్తిగత సిబ్బందిని గాయపరిచార’ని మురళీధరన్ ట్వీట్లో పేర్కొన్నారు. సంబంధిత వీడియోను జత చేసారు. టిఎంసీ కార్యకర్తలే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు.