న్యూ ఢిల్లీ: మెట్రో రైళ్ల సంచారం సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్గదర్శకాలను నెలాఖరులో జారీ చేయనున్నారు. ప్రయాణికులు టికెన్లు కొనుగోలు చేసి టోకెన్లు ఉపయోగించడానికి బదులుగా మెట్రో కార్డుల ద్వారా ప్రయాణానికి అనుమతించనున్నారు. పాన శాలల్లోనూ మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ మద్యం కొనుగోలుకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి విద్యాసంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది. సినిమా హాళ్లు, ఆడిటోరియంలు కూడా మరో నెల రోజులపాటు మూత పడే అవకాశం ఉంది. వ్యాధి వ్యాపించిన ప్రదేశాల్లో మాత్రం లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నారు.