న్యూఢిల్లీ: రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీని భాజపాలో విలీనం చేసేందుకు రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు అంగీకరించారు. ఇతర తెదేపా నేతలు విలీనాన్ని సవాల్ చేయదలచిని దశలోనే వెంకయ్య నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరిం చుకొంది. రాజ్యసభలో ఆరుగురు తెదేపా సభ్యులున్నారు. వారిలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు భాజపాలోకి తెదేపాపాని విలీనం చేయాలని గురువారం లిఖిత పూర్వకంగా కోరారు. రాజ్యసభ అంతర్జాల వేదికలో ఎగువ సభలో తెదేపా సభ్యులు మాత్రమే ఉన్నారని తాజాగా పేర్కొన్నారు. బీజేపీలో చేరిన నలుగురు సభ్యుల్ని ఆ పార్టీ సభ్యులుగా గుర్తించారు. ఈ విలీనం చెల్లదని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత వెంకయ్య నాయుడును కలుసుకునేందుకు ఐదుగురు తెదేపా సభ్యులు సమయాన్ని కోరారు.