విజయాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకునే తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో సెంటిమెంట్లను గుడ్డిగా ఫాలో అవుతుంటారు.వరుసగా రెండు హిట్లు పడితే గోల్డెన్ లెగ్గని రెండు ఫ్లాపులు వస్తే ఐరన్లెగ్గని ముద్ర వేస్తారు.గోల్డెన్లెగ్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు.ఈ విషయం రష్మిక మందన్నను చూస్తే అర్థమవుతుంది.అయితే ఎఫ్౨ వంటి భారీ హిట్ ఖాతాలో పడ్డా కూడా మెహ్రీన్ కు మాత్రం ఆ గోల్డెన్ డేస్ రావటం లేదు. అందుకు కారణం తన మేనేజర్, తన తల్లి అని మధనపడుతున్నట్లు సమాచారం. తనకు పీఆర్ సరిగ్గా లేకపోవటం వల్లే ఈ పరిస్దితి వచ్చిందని భావించిన మెహ్రిన్ పీఆర్ను తొలగించినట్లు సమాచారం.ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. మెహ్రీన్ కి అవకాశాలు రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తను బరువు పెరగటం వల్లనే అలా జరుగుతోందని ఆఖరుకి వెయిట్ తగ్గినా ఫలితం శూన్యం. ఎఫ్ 2లో స్విమ్ సూట్ వేసినా.. మెహ్రీన్ కెరీర్ కు కలిసొచ్చిందేమీ లేదు. బాలయ్య, గోపీచంద్ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చేసరికి ఆమెకు బెంగ పట్టుకుందట. ఇలాంటి సమస్య రావటానికి కారణం ఆమె తన మేనేజరే అని ..రీసెంట్ గా అతన్ని తొలిగించిందట. అలాగే మెహ్రీన్ విషయంలో తల్లి జోక్యం ఎక్కువైపోతోందని టాలీవుడ్లో వినిపిస్తూండటంతో ఆమెపై కూడా కోపం వ్యక్తం చేసిందిట.మరోవైపు తనను అడగకుండానే తన తల్లి.. ఓ పంజాబీ చిత్రం కమిటవడం మెహ్రిన్కు మరింత కోపం తెప్పించిందట. తెలుగుతో పోలిస్తే చాలా తక్కువ మార్కెట్ కలిగిన పంజాబీలో నటిస్తే ఒరిగే ప్రయోజనం శూన్యమంటూ మండిపడుతోందట.అయినా మన మాతృభాషలో సినిమా చెయ్యకపోతే ఎలా..మనవాళ్లంతా అక్కడే ఉన్నారని చెప్పి మెహ్రిన్ను ఒప్పించే ప్రయత్నం చేసిందని సమాచారం. ఇవన్నీ మనస్సులో పెట్టుకుని అటు మేనేజర్ కు బై చెప్పి, ఇటు తల్లికి ఓ రేంజిలో క్లాస్ పీకి తన ప్రస్టేషన్ తగ్గించుకునే ప్రయత్నం చేసిందట.