ది కశ్మీర్ పైల్స్ హింసను ప్రేరేపించింది

ది కశ్మీర్ పైల్స్ హింసను ప్రేరేపించింది

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హింస రగలడానికి వివేక్ అగ్నహోత్రి రూపొందించిన ది క శ్మీర్ పైల్స్ సినిమా కారణమని పీడీపీ అధినేత మెహ బూబా ముఫ్తి వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కశ్మీరీ పండిట్ కూడా హత్యకు గురవ్వలేదు. వారి భద్రతకు మేము కట్టుబడి పని చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం హిందూ-ముస్లింల మధ్య అసహజ వాతావరణం తయారు చేస్తున్నారు. జ్ఞానవాపి మసీదు అంశం కూడా అలాంటిదే. ఇది ఇంతటితో ఆగకపోవచ్చు. ఎన్ని మసీదుల మీద కన్ను పడిందో జాబితా ఇవ్వండి. మా దేవుడిని ఎక్కడ ఉండైనా కొలుచు కుంటాం’ అన్నారు.

తాజా సమాచారం