బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు’

బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు’

లక్నో: ‘బాలికలకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు. వీటి వల్ల అత్యాచారాలు పెరుగుతాయ’ని ఉత్తరప్రదేశ్ మహిళ కమిషన్ సభ్యురాలు మీనా కుమారీ చేసిన వ్యాఖ్యలువివాదాస్పదమయ్యాయి. కామెంట్స్ చేశారు. అలీగఢ్ జిల్లాలో మహిళలపై వేధింపుల కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు. వారు అబ్బాయిలతో గంటల తరబడి మాట్లాడి ఆ తరువాత వారితో పారిపోతారు. వారి ఫోన్లను ఎవరూ చెక్ చేయరు. కుటుంబ సభ్యులకు ఈ వివరాలేవీ తెలియవు. మహిళపై రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండటాన్ని సమాజం గంభీరంగా తీసుకోవాలి. తల్లులకు కూతుళ్ల పట్ల పెద్ద బాధ్యత ఉంటుంది. వారు నిరంతరం తమ కూతుళ్లను గమనిస్తూ ఉండాల’ని సూచించారు. అయితే..కమిషన్ వైస్ చైర్పర్సన్ అంజూ చౌదరి మాత్రం ఈ వివాదానికి దూరమయ్యారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడమనేది లైంగిక దాడుల నిరోధించదని స్పష్టం చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos