బాబుది ప్రచార ఆర్బాటం

బాబుది  ప్రచార ఆర్బాటం

అమరావతి: కరోనా పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. ఆయన ఆర్బాటమంతా ప్రచారం కోసమేనని విమర్శించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కరోనాను తెదేపా స్లీపర్ సెల్స్ వ్యాప్తి చేస్తున్నాయేమో? అనే అనుమానం కలుగుతోందన్నారు. ‘రాజధాని కోసం రైతులు, ప్రజల నుంచి జోలి పట్టి సేకరించిన నిధులు ఏమయ్యాయి? రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను ఆదుకునేందుకు చంద్రబాబు ఎందుకు సహకరించటం లేదు? కరోనాను తెదేపా-వైకాపా సమస్యగానే చూడొద్దు. రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేయబట్టే రాజ్భవన్లో వైరస్ సోకిందంటూ ఆరోపణలు చేయడం శోచనీయం. కరోనా కిట్ల వ్యవహారంలో పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసిన ధరకే తమకూ సరఫరా చేయాలని సదరు కంపెనీకి ముందే స్పష్టం చేశాం. ఇప్పుడు దానిపై ఈ విచారణల అవసరమేముంది?’’ అని మోపిదేవి ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos