బ్రిటన్ : బ్రెగ్జిట్పై ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైన వచ్చే జులైలో బ్రిటన్ ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు థెరిసా మే ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహించిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం నుంచి వైదొలగారు. ఉత్తరాధికారి నియమితులయ్యే వరకు ఆమె పదవిలో కొనసాగను న్నారు. బ్రిటన్ మాజీ విదేశాంగ మంత్రి బోరీస్ జాన్సన్ సహా పలువురు కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఈ పదవికి పోటీ పడుతున్నారు. బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31తో ముగియనుంది. కొత్తగా ప్రధాని పదవిని చేపట్టే నేత దీనిపై ఏకాభిప్రాయాన్ని సాధించి తుది రూపు ఇచ్చేందుకు స్వల్ప వ్యవధి మాత్రమే మిగిలి ఉంది.