నియమాల్ని గాలికి వదిలిన మోదీ

నియమాల్ని గాలికి వదిలిన మోదీ

లఖ్‌నవూ: ఏ విధమైన నియమావళిని పట్టించుకోని , ఎవ్వరినీ ఖాతరు చేయని ప్రధాని నరేంద్ర మోదీ వంటి నేతను సంఘ పరివార్‌ దేశానికి అందించిందని బిఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం చేసిన ట్వీట్‌లో ఎద్దేవా చేసారు. నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం ఆయన పై చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ‘ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తురని మోదీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా ఆయన స్వేచ్ఛగా ప్రచారంలో పాల్గొంటు న్నారు. వీటిని ఈసీ పట్టించుకోవ ట్లేదు. అందుకే, ఆయన పరిధిని దాటు తున్నారు. ఇటు వంటి నేతను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి అందించింది’ అని విమర్శించారు. దేశ వాసుల్ని భాజపా అవమానిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. ‘ప్రధాని పదవిని చేపట్టే అర్హత విపక్ష నేతల్లో ఎవ్వరికీ లేదని భాజపా నేతలు పదే పదే వ్యాఖ్యానించి దేశ ప్రజలను అవమానిస్తున్నారు. గతంలో నెహ్రూ తర్వాత అంతటి నేత ఎవరు? అంటూ దురహంకార పూరితంగా ప్రశ్నలు అడిగారు. అలా అడిగిన వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్న వారికి త్వరలో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతార’ ని గురువారం ట్వీట్‌ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos