విశాఖపట్నం : ఐపీఎల్ ఈ సీజన్లో బ్రహ్మాండమైన ప్రారంభాన్నిచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చివరి అంకంలో దూకుడు ప్రదర్శించలేక చతికిలపడింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ కేపిటల్స్తో బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్లో కళ్ల ముందే మ్యాచ్ చేజారిపోతుండడంతో ఎస్ఆర్హెచ్ ప్రధాన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక దశలో ఢిల్లీ గెలవడానికి 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉంది. వరుసగా వికెట్లు పడుతుండడంతో ఎస్ఆర్హెచ్ విజయంపై అందరికీ నమ్మకం కుదిరింది. అయితే చిచ్చర పిడుగు రిషభ్ పంత్, థంపీ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది, రన్ రేట్ను గణనీయంగా తగ్గించేశాడు. మ్యాచ్ మెల్లగా ఢిల్లీ వశమైంది. 18వ ఓవర్లోనే తమ పనై పోయిందని గ్రహించిన మూడీ కన్నీళ్లు పెట్టుకోగా, మైదానంలో కెప్టెన్ విలియమ్సన్ కూడా భావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ, సన్ రైజర్స్ టైటిల్ గెలవకపోవచ్చు కానీ అందరి మనసులనూ గెలుచుకుంది…అంటూ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.