స్వేచ్ఛా పోరులో కశ్మీరీలు

స్వేచ్ఛా పోరులో కశ్మీరీలు

ఇస్లామాబాద్ : కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం అక్కడి ప్రజలు పోరాడుతున్నారని జేకేఎల్ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్ భార్య మషాల్ మాలిక్ పేర్కొ న్నారు. ఇక్కడ జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్నారు. కశ్మీర్ వాసులు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని తను రచించిన ఒక పద్యాన్ని చదివి వినిపించారు. ‘కశ్మీర్ వేర్పాటువాదులలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ వారు భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నార’న్నారు. జేకేఎల్ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్ తో బాటు జమ్మూ-కశ్మీర్ లో ఉన్న వేర్పాటు వాదులంతా ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. యాసిన్ మాలిక్ భార్య మషాల్ మాలిక్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో బుధవారం జరిగిన స్వాతంత్ర్య దిన వేడుకల్లో ఆమె పాల్గొ న్నారు. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రసంగించారు. కశ్మీర్ వాసుల స్వాతంత్ర్యం పోరాట పద్యాన్ని వినిపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos