ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభపడి 41,352 వద్ద, నిఫ్టీ 111పాయింట్లు లాభపడి 12,165 వద్ద ఆగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.96 వద్ద నమోదైంది. బీఎస్ఈలో టైమ్ టెక్నోప్లాస్ట్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, జిందాల్ ఎస్టీ పవర్, ఎంఎంటీసీ లిమిటెడ్, జై కార్పొరే షన్ లిమిటెడ్ కంపెనీలు లాభాలు పొందాయి. ట్రైడెంట్ లిమిటెడ్, పీసీ జ్యువెల్లర్, ఇండియన్ బ్యాంక్, మాగ్మా ఫిన్కార్ప్ లిమిటెడ్, వర్ల్పూల్ కంపెనీలు నష్ట పోయాయి.