ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం హుషారుగా ప్రారంభమయ్యాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 38,510 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద ఉన్నాయి. నిఫ్టి దిగ్గజాలలో జీ, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, శ్రీ సిమెంట్, యూపీఎల్, విప్రో, బ్రిటానియా 1.8-0.7 శాతం మధ్య లాభ పడ్డాయి.