ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఉదయం 9:16గంటలకు సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 39,652 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 11868 వద్ద ట్రేడయ్యాయి. 360 కంపెనీల షేర్లు లాభాల్ని గడించాయి. 216 కంపెనీల షేర్లు నష్ట పోయాయి. మరో 22 కంపెనీల షేర్లు స్థిరంగా ట్రేడ్ అయ్యాయి. ఐవోబీ, టెక్ మహింద్రా, విప్రో, డా.రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్ని గడించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, జీ ఎంటర్టైన్మెంట్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, కాక్స్ అండ్ కింగ్స్, సుజ్లోన్ ఎనర్జీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.