న్యూ ఢిల్లీ: ఇక్కడి ఎర్రకోట 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. సైనిక విన్యాసాలు, పరేడ్ కోసం అక్కడ త్రివిధ దళాలకు శిక్షణ జరుగుతోంది. కరోనా కారణంగా సైనిక దళాలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఫుల్ డ్రస్లో కవాతు చేస్తున్నారు. వాన పడుతున్నా కసరత్తు సాగుతోంది. ఆగస్టు 15న ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించించి త్రివర్ణ రంగులున్నగాలి బుడగల్ని గాల్లోకి వదిలేస్తారు. తర్వాత మోదీ ప్రసంగిస్తారు.