మరో ఏడాది పాటు ‘మావో’లపై నిషేధం

మరో ఏడాది పాటు ‘మావో’లపై నిషేధం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగించింది.1992 ప్రజా భద్రతా చట్టం కింద 2019 ఆగస్టు 17 నుంచి మరో ఏడాది పాటు నిషేధం అమలు కానుంది. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, విప్లవ కార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలకూ ఈ నిషేధం వర్తిస్తుంది. 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos