గాడ్సేను భారత రత్నతో పురస్కరించాలి

గాడ్సేను  భారత రత్నతో పురస్కరించాలి

ముంబై: ‘సావర్కర్కు కాదు మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరామ్గాడ్సేకు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాల’ ని కాంగ్రెస్ పార్టీ గురువారం ఇక్కడ భాజపాను ఎద్దేవా చేసింది. ఈ నెల 21న జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే మరాఠా ‘యోధుడు’ సావర్కర్కు భారత తర్న పురస్కారం దక్కేలా కృషి చేస్తామని కమలనాధులు ఎన్నికల ప్రణాళికలో భరోసా ఇచ్చారు. ‘గాంధీని హత్య చేయడానికి సావర్కర్ కుట్రపన్నారనే ఆరోపణలు మాత్రమే వచ్చాయి.. అయితే నాథూరామ్ గాడ్సే గాంధీని బలి తీసుకున్నారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని సావర్కర్కు బదులుగా నాథూరామ్ గాడ్సేకే దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలి’అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ నేత మనీష్ తివారి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయాన్ని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా వ్యక్తీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos