ద్రోహికి బుద్ధి చెప్పండి

ద్రోహికి బుద్ధి చెప్పండి

హైదరాబాదు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయడం అంటే… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి ద్రోహం చేసి నట్టే నని మంగళవారం రాత్రి ఒక ట్వీట్ చేశారు. ‘తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సోనియా అన్ని రకాలుగా త్యాగం చేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన సోనియాకు ద్రోహం చేసిన రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేలా మునుగోడు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం కావాలి. జై కాంగ్రెస్’ అని ట్వీట్లో నినదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos