మేనకా గాంధీపై కేసు నమోదు

మేనకా గాంధీపై కేసు నమోదు

తిరువనంతపురం : భాజపా సీనియర్ నాయకురాలు మేనకా గాంధీకి వ్యతిరేకంగా పోలీసు కేసు దాఖలైంది. మలప్పురం జిల్లా వాసులను కించపరిచేలా ఆమె సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని చేస్తున్నారని మలప్పురానికి చెందిన న్యాయవాది సుభాష్ చంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.‘ మే 29న ఏనుగు పాలక్కడ్ జిల్లాలో మృతి చెందింది. మలప్పురం జిల్లాలో కాదు. ఏనుగు ఘటనకు కొందరు మతం రంగు పులుముతున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మనేకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నార’ ని పేర్కొ న్నారు. ‘మల ప్పురం జిల్లాలో జంతువులపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటివరకు ఒక్క నేరస్తుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా అయితే వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు’ అని ఆమె ట్విట్టర్లో ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos