శ్రీవిద్యానికేతన్
విద్యాసంస్థల ఫీజు రీఎంబర్స్మెంట్ వివాదం రోజురోజుకు ముదురి పాకాన పడుతోంది.రీఎంబర్స్
మెంట్ ఇవ్వలేదంటూ ఆరోపిస్తూ మోహన్బాబు విద్యార్థులతో కలసి ర్యాలీకి పిలుపునివ్వడం
పోలీసులు మోహన్బాబును అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.ఎన్నికల సమయంలో తెదేపాను రాజకీయంగా
దెబ్బ తీసే ఉద్దేశంతోనే మోహన్బాబు ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో ర్యాలీ నాటకానికి
తెర తీశాడంటూ తెదేపా శ్రేణులు ఆరోపించాయి.దీంతో మోహన్బాబు కుమారులు మంచు విష్ణు,మంచు
మనోజ్లు తెదేపా వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ విద్యాసంస్థలకు ప్రభుత్వం
నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకునే ఉద్దేశం మినహా ర్యాలీ వెనుక ఎటువంటి రాజకీయ
ఉద్దేశం లేదంటూ స్పష్టం చేశారు.ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి
రెండుసార్లు లేఖలు రాశామని కొంతమంది ఐఏఎస్ అధికారులను కలిసి విన్నించినా ఫలితం లేదన్నారు.శ్రీవిద్యానికేతన్
సంస్థలకు రావాల్సిన బకాయిలపై తప్పుడు లెక్కలు చూపుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై మంచు
విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి అన్ని వివరాలతో
ఐఏఎస్ అధికారి రావత్కు పంపించిన లేఖలను ఒక్కసారి పరిశీలించుకోవాలని అందులో తమకు రావాల్సిన
బకాయిల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నా ఆస్తులన్నీ అమ్మేసి పీ పార్టీకి విరాళంగా
ఇస్తానంటూ ఛాలెంజ్ విసిరాడు.కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు చదువు అందించాలనే
సదుద్దేశంతో మానాన్న మోహన్బాబు తాను సంపాదించిన డబ్బుతో 25శాతం ఉచిత విద్య అందిస్తున్నారని
తమపై ఆరోపణలు చేసే తెదేపా నేతలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బదులిచ్చారు.మోహన్బాబుకు
మద్దతుగా మంచు విష్ణు,మంచు లక్ష్మీప్రసన్నతో పాటు శ్రీవిద్యానికేతన్ విద్యార్థులు
కూడా తోడుగా నిలుస్తున్నారు..