సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే తెలుగు నటీనటుల్లో మంచు మనోజ్ ముందు వరసులో ఉంటాడు.అభిమానుల ప్రశ్నలతకు స్పందించడంతో పాటు సామాజిక సమస్యలపై కూడా మనోజ్ స్పందిస్తుంటాడు.ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన ట్వీట్కు మనోజ్ స్పందించిన తీరుపై నెటిజన్లతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను సైతం మెప్పిస్తోంది.పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన సాయినాథ్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకు పవన్ అంటే ప్రాణమని, ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని తెలిపాడు. ప్రస్తుతం తన తండ్రికి చాలా సీరియస్గా ఉందని, తన తండ్రికి జరిగిన ప్రమాదం కారణంగా కోమాలో ఉన్నాడని, తన దగ్గర వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదు కాబట్టి దయచేసి సహాయం అందించండి అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.తన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ లకు ట్యాగ్ చేశాడు.సాయినాథ్ చేసిన ట్వీట్ చూడగానే వెంటనే స్పందించాడు మంచు మనోజ్. నీ వివరాలు పంపు స్వామి.. మా వాళ్లు నీ దగ్గరికి వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండు మీ నాన్నకు ఏం కాదంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో సాయినాథ్ సహా అతని కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు మంచు మనోజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
@HeroManoj1 @PawanKalyan @VVL_Official especially Manoj anna and frnds meeru spandinchina vidanam chala bagundi anna tq so much anna reports inka chala unnai anna chuskodaniki okkadine undadam valla tens ki vachinavi pedthuna anna pls sry and tq so much 🙏🙏🙏 pic.twitter.com/VMYYm8bC5g
— SainathKalyan (@RameshK86683719) October 15, 2019