జై కరోనా.. సిగ్గు చేటు

జై కరోనా.. సిగ్గు చేటు

హైదరాబాదు: ‘జై కరోనా అని నినదిస్తున్నారు. కరోనాను ప్రధాని లేక ముఖ్యమంత్రిని చేసేట్లున్నారు. మనోళ్లు. సిగ్గ చేటు’అని నటుడు మనోజ్ మండి పడ్డారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. కొందరు బాణసంచా కాల్చారు. ఇది కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలకు దారి తీసింది. సంబంధిత వీడియోను చూసిన మనోజ్ మండి పడ్డాడు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను మనోజ్ రీట్వీట్ చేశాడు. బాణసంచా కాల్చడం వలన తమ ఇంటి పక్కన భారీ అగ్ని ప్రమాదం జరిగిందని ఓ నెటిజన్ చెప్పాడు. ‘కొందరు బాణసంచా కాల్చుతున్నారు. ఇలా చేయాలని వారిని ఎవరూ అడగలేదు.. దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి. ఈ పటాసుల్ని కాల్చడం చూస్తుంటే మన వాళ్లు కరోనాని కూడా సీఎంని లేక పీఎంని చేసేలా ఉన్నారు. తికమకపెడుతున్నారు.. జై కరోనా అని కూడా అంటున్నార’ని ఎద్దేవా చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos