హైదరాబాదు: తెలుగు తెరకు మరో మలయాళ నటి-మానస రాధాకృష్ణన్ పరిచయం కానున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ఒక సినిమాను చేయనన్నారు. ఇందులో ఆమె కథానాయకి. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది. ఇంత వరకూ 10 మలయాళ చిత్రాలలో నటించింది. మానస రాధాకృష్ణన్, పవన్ కల్యాణ్ జోడీగా నటించటానికి అంగీకరించిందని అంటున్నారు. ఇది అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘పరమగురు’ సినిమా చేస్తోంది.