ఏనుగు ఘీంకారం : హొసూరు వద్ద ఒకరి మృతి

ఏనుగు ఘీంకారం : హొసూరు వద్ద ఒకరి మృతి

హోసూరు : ఇక్కడికి సమీపంలో ఏనుగు దాడి చేసిన సంఘటనలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని బాలతోటనపల్లి గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప పశువుల కాపరి. సోమవారం పశువులను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తిమ్మ రాయప్ప పశువుల సంఖ్య తక్కువగా ఉండటంతో మంగళవారం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెతుకుతూ వెళ్ళాడు. ఉబ్బరాణపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను వెతుకుతుండగా అకస్మాత్తుగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు తిమ్మరాయప్పపై దాడి చేసింది. ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. మరో సంఘటనలో  దిన్నూరు గ్రామానికి చెందిన పెద్ద వెంకటప్ప అడవిలో పశువులను మేపుతుండగా, అదే  ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగు పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులపై ఏనుగు దాడి చేసిన సంఘటన డెంకణీకోట ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఏనుగుల మందను సుదూర అడవులకు తరలించాలని అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos