కోల్కతా : నందిగ్రామ్ ముస్లింలను పాకిస్తానీలని వ్యాఖ్యానించిన ఎందరిపై కేసులు నమోదు చేశారో చెప్పాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలా వ్యాఖ్యానించడానికి వారికి సిగ్గులేదా? ని బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని, తాను అన్ని వర్గాల వారికీ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. దామ్జూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తనకు 10 షోకాజ్ నోటీసులు జారీ చేసినా, లెక్కచేసే ప్రసక్తే లేదన్నారు. హిందూ, ముస్లింలంటూ రోజూ ప్రచారంలో వ్యాఖ్యానించే ప్రధాని మోదీపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తదుపరి తారకేశ్వర్లో ప్రసంగించారు. ‘దుష్టశక్తుల మాటలు విని, మీ ఓట్లను చీల్చుకోవద్దని మైనారిటీ సోదరసోదరీమణులను కోరుకుంటున్నా. సీపీఎం, బీజేపీ వారు మీ ఓట్లను చీల్చడానికి డబ్బులతో సహా దిగుతార’ని వ్యాఖ్యానించారు.