బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి?

బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు  ఎందుకు ఇవ్వాలి?

కోల్కతా : కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చు కునేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ‘అగ్ని పథ్ నుంచి నాలుగేళ్ల తర్వాత బయటికి వచ్చిన అగ్ని వీర్ లకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ అందింది. బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మనం ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర యువతకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం..” అని స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఓ హిందూ దర్జీని కొందరు నరికి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘‘హింస, ఉన్మాదం ఎప్పటికీ ఆమోదనీయం కాదు. అది ఏదైనా సరే. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా వారికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాం. అంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos