న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపడం లేదు. సెప్టెంబర్ 30న మూడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన శాసనసభ మమతా బెనర్జీ సార థ్యం లోని టీఎంసీ సంచలన విజయం సాధించినప్పటికీ ఆమె నందిగ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి సోభన్దేవ్ ఛటోపాధ్యాయ గత మేలో భవానీపూర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేసారు. ఆమె గెలిస్తేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను టీఎంసీ 213 స్థానాల్లో గెలుపొందింది.