హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 220 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందన్నారు. నాగర్ కర్నూలులో తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానని జోస్యం చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోది తుది విడత ఎన్నికలకు ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.