ముంబై : తమకు 119 ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్ర కాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీ పీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ శనివారం ఇక్కడ మండి పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందనటం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడమేనని వ్యాఖ్యానించారు. వారి మాటలు నిజమైతే ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందు కు రాలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలి సిందే.