సూపర్స్టార్
మహేశ్బాబు అభిమానుల కోరిక ఫలించింది.కొన్ని నెలల క్రితం సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్
మ్యూఙియంలో తయారు చేసిన మహేశ్బాబు మైనపు విగ్రహాన్ని అభిమానుల కోసం హైదరాబాద్కు తీసుకువచ్చారు.తమ
అభిమాన నటుడి మైనపు విగ్రహాన్ని చూసుకోవడానికి తమకు అవకాశం కల్పించాలని అందుకు మహేశ్బాబు
మైనపు విగ్రహాన్ని ఒక్కరోజైనా హైదరాబాద్లో ఉంచాలంటూ అభిమానులు డిమాండ్ చేయడంతో అభిమానుల
విజ్ఞప్తి మేరకు మహేశ్ మైనపు విగ్రహాన్ని నగరంలోని ఏఎంబీ సినీ కాంప్లెక్స్లో ఉంచారు.బ్లాక్ సూట్లో మహేశ్ మైనపు బొమ్మ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహేశ్ తన సతీమణి నమత్ర, పిల్లలు సితార, గౌతమ్తో కలిసి ఈరోజు ఉదయం ఏఎంబీ థియేటర్కు చేరుకున్నారు. మహేశ్ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్కు తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ వద్ద బారులు తీరారు.