రైతుల సమస్యల నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు నటిస్తున్న కొత్త చిత్రం మహర్షి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే.ఏప్రిల్ నెలలోనే విడుదల చేస్తామంటూ నిర్మాత దిల్రాజ్ గతంలో ప్రకటించినా కొన్ని అనివార్య కారణాల వల్ల మే నెలకు చిత్రం విడుదల వాయిదా పడడంతో డీలా పడ్డ అభిమానులకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ శనివారం ఓ హుషారైన కబురు అందించాడు. త్వరలోనే మహర్షి సందడి షురూ కాబోతుందని మహర్షి చిత్రంలోని మొదటిపాటను మార్చ్29వ తేదీన విడుదల చేయనున్నట్లు దేవిశ్రీ ట్విట్టర్లో తెలిపాడు.అదే సమయంలో మహేశ్ కూతురు సితార డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.మహేశ్బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంలోని చారుశీల పాటకు సితార తన స్నేహితురాలితో కలసి డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియోను దేవిశ్రీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అభిమానులు వీడియోను వైరల్ చేశారు.కొద్ది రోజుల క్రితం బాహుబలి చిత్రంలో ఓ పాటకు సితార డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే..