మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు

మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు

హైదరాబాదు: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది. తాను రచించిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిత శరత్ చంద్ర కోర్టు కెక్కారు. సుప్రీం కోర్టు దర్శకుడు కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos