సూపర్స్టార్ మహేశ్బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహర్షి చిత్రం ఫస్ట్ సింగిల్ శుక్రవారం ఆన్లైన్లోకి వచ్చేసింది. పాట సాంతం స్నేహంలోని గొప్పదనం గురించి తల్లితండ్రులు ఇవ్వలేనిది చెలిమిలో ఏది ఎలా దొరుకుతుందో వివరిస్తూ శ్రీమణి రాసిన సాహిత్యం సింపుల్ పదాలతో క్యాచీగా ఉండటమే కాదు రిపీట్ మోడ్ లో వెళ్లేలా చేసింది.శ్రీమణి రాసిన అందమైన లిరిక్స్కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన వినసొంపైన సంగీతం తోడు కావడంతో పాట అద్భుతంగా అనిపిస్తోంది.పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేశ్ కీలకపాత్రలోనటించిన మహర్షి చిత్రం మే 9వ తేదీన విడుదల కానుంది..