‘కశ్మీర్‌ ’ చిక్కుముడి

‘కశ్మీర్‌ ’ చిక్కుముడి

ఇస్లామాబాద్: కశ్మీర్ వివాదంలో ఉద్రిక్తతల్ని తగ్గించే మార్గాల అన్వేషణ తమకు చాలా క్లిష్టతరమని అమెరికా సీనియర్ సెనేటర్ మ్యాగి హసన్ శుక్ర వారం అన్నారు. శాంతి, భద్రతల కోసం ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. మరో సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ తో కలిసి ఆమె పాక్ లో పర్యటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సైన్యాధిపతి ఖమర్ జావెద్ బజ్వాలతో చర్చించారు. శుక్రవారంవారిద్దరూ భారత్ చేరుకున్నారు. పలు అంశాలపై భారత అధికారులతో చర్చలు జరుపుతారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వరాదని అమెరికా సీనియర్ సెనేటర్ మ్యాగి హసన్ శుక్ర వారం ఇక్కడ పాకిస్థాన్కు విన్నవించారు. ‘ఆఫ్ఘనిస్థాన్ లో శాంతి, స్థిరత్వం స్థాపన ప్రయత్నాల్లో పాక్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. అలాగే, ఉగ్ర వాద నిరోధకం విష యంలో కఠిన చర్యలు తీసుకోవాలి. తాలిబన్లతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలను అరికట్టే విషయంలో పాక్ నాయకత్వంతో తప్ప ని సరిగా సంప్రదింపులు జరపాల్సి ఉంద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos