మృత్యుంజయురాలు మధులిక ప్రేమోన్మాది భరత్ తనపై చేసిన ఆటవిక
దాడిని గుర్తు చేసుకుంది. కొబ్బరి బొండాల కత్తితో భరత్ చేసిన దాడిలో ఆ బాలిక తీవ్రంగా
గాయపడి, మరణంతో పోరాడి మృత్యుంజయురాలిగా బయటపడిన సంగతి తెలిసిందే. బుధవారం ఆమెను ఆస్పత్రి
నుంచి డిశ్చార్జి చేయగా, గురువారం ఓ టీవీ ఛానెల్తో మాట్లాడింది. ‘ఆ రోజు ఉదయం వెళుతుంటే.. భరత్ వెనకాలే వచ్చి ఓ గల్లీలోకి తీసుకు వెళ్లాడు. ఎనిమిది అవుతుంది. అక్కడ ఎవరూ లేరు. నరకడం మొదలు పెట్టాడు. గట్టిగా అరిచేసరికి ఇద్దరు ఆంటీలు వచ్చారు. అప్పటికే తలపై దెబ్బ పడేసరికి కింద పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నాన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరత్ కోపంతో ఇలా చేశాడు. మేము పెద్దగా మాట్లాడుకునేవాళ్లం కాదు. ఇరుగు పొరుగు వాళ్లమంతే. భరత్పై జనవరిలో ఫిర్యాదు చేశాం. ప్రేమ కుదరదన్నాను. కాదనేసరికి బెదిరించేవాడు. చంపేస్తానని అనేవాడు. ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు. దాడి తర్వాత ఈ ప్రపంచాన్ని చూస్తాను అనుకోలేదు. నాలాగే ఇంకొకరికి కాకూడదు. ఇలాంటి వాళ్లు ఉండకూడదు. వాళ్లకు శిక్ష వేయాలి. కఠినంగా శిక్షించాలి’ అని తన ఆవేదనను వెలిబుచ్చింది.