బాబు, కేసిఆర్‌ కలలు కల్లలే

బాబు, కేసిఆర్‌ కలలు కల్లలే

న్యూఢిల్లీ: ‘మనకు కింగ్ (మోదీ) ఉన్నప్పుడు. కింగ్ మేకర్లతో అవసరం ఏంముంద’ని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రశ్నించారు. మంగళ వారం ఇక్కడ ఒక దృశ్య మాధ్యమానికి ఇంటర్వ్యూలో ‘తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా భాజపా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత అధిక్యతను సాధిస్తుందని’ ఆశించారు. ‘మరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. మా గెలుపుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి నేతలు కింగ్ మేకర్లు కావాలని కలలు కంటున్నారు. మనకు కింగ్ (మోదీ) ఉన్నప్పుడు… కింగ్ మేకర్లతో అవసరం ఏంముంద’ని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మహాకూటమి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటునకు కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నందున రాంమాధవ్ ఈ మేరకు స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos