ఆధిపత్య పోరులో ఎల్వీఎస్‌ ఓటమి

ఆధిపత్య పోరులో ఎల్వీఎస్‌ ఓటమి

అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసినట్లు సాధారణ పరి పాలన రాజకీయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది అధికార యంత్రాంగంలో కలకలాన్ని రేపింది. ముఖ్య మంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి , జీఏడీ రాజాకీయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు ఎల్వీ సుబ్రహ్మణ్యం సంజాయిషీ తాఖీదు జారీ చేసారు. 15 రోజుల్లోగా బదులివ్వాలని ఆదేశించారు. తన అనుమతి లేకుండానే మంత్రి వర్గ సమావేశం చర్చనీయాంశాల్ని ఖరారు చేసినందుకు సంజాయిషీ తాఖీదు జారీ చేసారు. తనకు తెలియకుండా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్కు తాఖీదు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు సమా చారం. దరిమిలా సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos