న్యూ ఢిల్లీ: వంట ఇంధన వాయు ధరలు పెరిగాయి. పద్నాలుగు కిలోల బరువైన సిలెండర్ ధర రూ.16 అధికమైంది. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. గృహా వసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.590.50 నుంచి 606.50కు ,వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను రూ.1123 నుంచి రూ.1174లకు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి.