జనాన్ని దోచుకుంటున్న మోదీ

జనాన్ని దోచుకుంటున్న మోదీ

న్యూ ఢిల్లీ :వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరగడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందని దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధర ఒకే సారి రూ. 50 పెరిగింది. ‘సబ్ కా సాథ్… సబ్ కా వికాస్’ అంటూ నినాలు చేసే ప్రధాని మోదీ… జనాలను దోచేస్తూ, కేవలం ఇద్దరికి మాత్రమే వికాసాన్ని ఇస్తున్నారని ట్వీట్లో విమర్శించారు. ఆ ఇద్దరి పేర్లను వెల్లడించలేదు. వారిద్దరూ అనిల్ అంబానీ, గౌతమ్ అదానీలే అయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై విమర్శలు గుప్పిస్తూ గతంలో రాహుల్ ట్వీట్ చేసిన సందర్భంగా… అంబానీ, అదానీలను ట్యాగ్ చేయడం గమనార్హం. ఇద్దరు ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. సామాన్య ప్రజల సంక్షేమాన్ని మోదీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos