ముంబై: మార్కెట్ సూచీలు సోమవారం బాగా పతనమయ్యాయి. ఉదయం 9.49 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 41,930 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు దిగజారి 12,333 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.92 వద్ద దాఖలైంది. చమురు ధరల పెరుగుదలే సూచీన పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలు పొందాయి. ఐవోసీ, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సీఎల్ టెక్, విప్రో, యూపీఎల్ నష్ట పోయాయి.