నష్టాల విపణి

నష్టాల విపణి

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారమూ నష్టాల పాలయ్యాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా తదితర ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి గురికావడం ఇందుకు కారణం. సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 51,324కి, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 15,118కి దిగజారాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఓఎన్జీసీ (8.32%), ఎన్టీపీసీ (4.08%), ఏసియన్ పెయింట్స్ (3.50%), టెక్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.85%) లాభాల్ని గడించాయి.
బజాజ్ ఫైనాన్స్ (-2.43%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.20%), నెస్లే ఇండియా (-2.18%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.08%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos