నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెప్టెంబర్ ఫ్యూచర్, ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగుస్తుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపిం ది. లాభాలు, నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ స్టాకులు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 59,126కి పడి పో యింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 17,618 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్ సర్వ్ (2.19%), బజాజ్ ఫైనాన్స్ (2.05%), ఎన్టీపీసీ (0.96%), సన్ ఫార్మా (0.82%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.60%) దండిగా లాభాల్ని గడించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.67%), ఏసియన్ పెయింట్స్ (-2.3 4 %), యాక్సిస్ బ్యాంక్ (-1.87%), బజాజ్ ఆటో (-1.56%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.32%) తీవ్రంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos