నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిసాయి. లాభాల్లో విపణలు ప్రారంభమయ్యాయి. చివరి గంటన్నరలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు నష్టపోయి 57,060కి, నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 17,102కి దిగ జారాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.44%), సన్ ఫార్మా (0.94%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.87%), టాటా స్టీల్ (0.86%), డాక్టర్ రెడ్డీస్ (0.28%) లాభాల్ని గడించాయి. యాక్సిస్ బ్యాంక్ (-6.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.42%), విప్రో (-2.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.08%), మారుతి (-1.97%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos