ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతోనే ట్రేడింగ్ ను ఆరంభించాయి. ఉదయం 9.33 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయి 38,043 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,429 వద్ద ట్రేడయ్యాయి. వేదాంత, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, టాటామోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వేదాంతా షేర్లు ఏకంగా 3శాతం నష్టపోయాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్న దశలొ మార్కెట్లు ఒడి దొడుకులకు లోనవుతున్నాయి. మరోపక్క చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.