స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను మూట కట్టుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం ఇందుకు కారణం. ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. కి సెన్సెక్స్ 400 పాయింట్లు కోల్పోయి 51,703కి, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 15,208 కి కూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.39%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.04%), ఎన్టీపీసీ (1.33%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.12%), బజాజ్ ఆటో (0.94%) దండగా లాభాల్ని గడించాయి. నెస్లే ఇండియా (-2.80%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.61%), ఏసియన్ పెయింట్స్ (-2.48%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.48%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.46%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos