స్టాక్ మార్కెట్లకు నష్టాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయి 34 ,702 వద్ద , నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంతో 10,236 వద్ద ఆగాయి. హెచ్యూఎల్, ఐటీసీ, నెస్లే, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, ఎల్&టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రూపాయి స్వల్పంగా 5 పైసలు పుంజుకుంది. డాలర్తో పోలిస్తే మారకం విలువ రూ.75.60 వద్ద ఆగింది. ముడి చమురు ధర అంతర్జాతీయ విపణిలో పీపా 40.24 డాలర్లకు చేరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos